Trending Now
Tuesday, February 24, 2026

Buy now

Trending Now

గెలుపును జీర్ణించుకోలేక అక్రమ అరెస్టులా…?

గెలుపును జీర్ణించుకోలేక అక్రమ అరెస్టులా…?

 

– ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య

మంగపేట, పిబ్రవరి 23, అక్షర సవాల్:

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్టు చేయించి ఆనందాన్ని పొందుతున్న మంత్రి వివేక్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకుల సమావేశంలో చిట్టిమల్ల సమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలతో గెలిచిన అహంకారం తప్ప ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేసిన సేవ ఏ కోణంలో చూసిన కనబడదు. చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బిఆర్ఎస్ పార్టీ నేతలను కార్పొరేటర్లుగా గెలిపిస్తే ఆ గెలుపును జీర్ణించుకోలేక అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ  దళిత నాయకులు చిట్టి మల్ల సమ్మయ్య నిమ్మగడ్డ ప్రవీణ్ కర్రీ శ్రీను బియ్యం శ్రీను బోడ ప్రసాద్ పట్టెం సందీప్ తెల్ల నగేష్ నిట్ట బన్ని దళిత నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles