Trending Now
Wednesday, May 28, 2025

Buy now

Trending Now

సభా ప్రాంగణాన్ని పరిశీలించిన  ఎస్పీ 

సభా ప్రాంగణాన్ని పరిశీలించిన  ఎస్పీ 

భూపాలపల్లి, ఏప్రిల్ 29(అక్షర సవాల్):

రేగొండ మండల కేంద్రంలో రేపు నిర్వహించనున్న కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే  సోమవారం పరిశీలించారు. బహిరంగ సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ తో పాటు హేలిప్యాడ్ దిగే స్థలాన్ని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే  పోలిసు అధికారులతో కలిసి పరిశీలించి, భద్రతా పరంగా పలు సూచనలు చేశారు. ఎస్పి  వెంట భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, చిట్యాల సిఐ దగ్గు మలేష్ యాదవ్, ఎస్సై ఎన్ రవికుమార్ ఉన్నారు.

Related Articles

Latest Articles