మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి,
మత్తులో ముంచి అఘాత్యాలు
6 గురి అరెస్ట్,కారు,4 మొబైల్స్ సీజ్
75 వేల నగదు,43 వందల కండోమ్ ప్యాకేట్స్ స్వాధీనం
లవ్ పేరుతో మైనర్ తో ప్రేమాయణం ఆపై ఎంజాయ్
ఫ్రెండ్స్ తో అత్యాచారాలు, ఆపై బ్లాక్ మెయిలింగ్
వివరాలు వెల్లడించిన వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైమ్ మార్చి 18 (అక్షరసవాల్) ఓరుగల్లు కేంద్రంగా మైనర్ బాలికల కిడ్నాప్,మత్తులో ముంచి ఆఘత్యాలకు తెగబడ్డ కిలాడి కిరాతకాల ముఠా గుట్టును వరంగల్ పోలీసులు బట్ట బయలు చేశారు. పక్కా ప్లాన్ తో అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని అమ్మాయిలను ప్రేమాయణం పేరుతో ట్రాప్ చేసి, మద్యం, గంజాయి మత్తుకు బానిసను చేసి ముందుగా లవర్ ఎంజాయ్ చేసి,ఆ తర్వాత వ్యభిచార రొంపి లోకి నెట్టే కేటుగాళ్ల ముఠాను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. 6 గురు సభ్యులను మంగళవారం అరెస్ట్ చేశారు వారి నుండి ఒక బ్రిజా కారును, 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.అంతేగాక 75 వేల నగదును,43 వందల కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలల్లో సంచలనం సృష్టించిన కిలాడి ముఠా కిరాతకాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి,అత్యాచారాలకు పాల్పడుతున్న ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. 6 గురు సభ్యుల ముఠా సభ్యులు ప్రేమాయణంతో మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి,వారికి మద్యం,గంజాయి మత్తులో ముంచేసి వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తేల్చేశారు. ఆ తర్వాత ముక్కుపచ్చలారని మగువలను వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ముఠా ప్రయత్నిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ఓ మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన అనంతరం వ్యభిచారం చేయించేందుకు యత్నిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన్నట్లు తెలిపారు.ఇందులో ఒక మైనర్ బాలిక మరో మహిళతో పాటు, నలుగురు ఒకే సెక్షన్ వ్యక్తులను మిల్స్కాలనీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని వివరించారు.వీరి నుండి కిలో ఎనిమిది వందల గ్రాముల గంజాయితో పాటు ఒక కారు, 75 వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు, ప్రధాన నిందితురాలి ఇంటి వద్ద భారీ స్థాయిలో కండోమ్ ప్యాకేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు విపులీకరించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో నిందితుల వివరాలను:ముస్కు లత(ల్యాదేళ్ళ గ్రామం, దామెర మండలం, వరంగల్ జిల్లా), మైనర్ బాలికతో పాటు వరంగల్ నగరంలోని శంభుని పేటకు చెందిన అబ్దుల్ అఫ్నాన్, షేక్ సైలాని బాబా,మహ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ ఆలియాస్ వదూద్ లు ఉన్నారు. ఈనెల 11వ తేదిన మైనర్ బాలిక కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదుపై మీల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు బాలికను ములుగు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి బాలికనకు పోలీసుల సంరక్షణలోకి తీసుకోని విచారించారు. తనను కొంత మంది వ్యక్తులు కిడ్నాప్ చేసి,గంజాయి మత్తులో ముంచి అత్యాచారానికి పాల్పడినట్లుగా సదరు బాలిక పోలీసులకు తెలియజేసింది. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా పర్యవేక్షణలో వరంగల్ ఏసిపి అధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకొన్నారు. ఈ వ్యవహరంలో ప్రధాన నిందితురాలైన ముస్కు లత, ల్యాదేళ్ళ గ్రామంలో వ్యభిచార వృత్తిని కొనసాగిస్తోన్నట్లు గుర్తించారు.తల్లిదండ్రులు మరణించిన మరో మైనర్ బాలికకు ముష్కే లత తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించింది. వ్యభిచారమే వృత్తిగా చేసుకొన్న ప్రధాన నిందితురాలు విటులను ఆకర్షించేందుకు గాను తన వృత్తిలోకి ఎప్పుడు కొత్త మహిళలు లేదా బాలికలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకొనే స్కెచ్ వేసింది. వచ్చే డబ్బుల్లో ఇంట్లొ ఆశ్రయం కల్పించిన మైనర్ బాలికకు వాటా ఇస్తానని ఎర వేసింది. మైనర్ బాలిక అంగీకారం తెలిపి తన స్నేహితరాలితో పరిచయమైన బాధిత బాలికను లక్ష్యంగా చేసుకొని మైనర్ నిందితురాలు ఇన్ స్టాగ్రాం ద్వారా బాధిత బాలికతో పరిచయం పెంచుకొంది.అంతే కాకుండా బాలిక స్కూల్ కు వెళ్ళి వచ్చే సమయాల్లో నిందితురాలు బాధిత బాలికను కలిసేది. ఆ చనువుతో బాధిత బాలికను మైనర్ నిందితురాలు,తన ప్రియుడైన అబ్దుల్ అఫ్నాన్తో కలిసి మద్యం,గంజాయి మత్తు ను అలవాటు చేసారు.మైనర్ నిందితురాలిపై మరింత నమ్మకం కలిగేందుకు బాలికకు షాపింగ్ మాల్స్కు తీసుకవెళ్ళి బట్టలను కొనించడం చేసి సదరు బాధిత బాలికను ట్రాప్ చేశారు. ఆ పరిచయం మేరకే ఈ నెల 11వ తేదిన మైనర్ బాలికను నిందితురాలు తన ప్రియుడుతో పాటు మరో ఇద్దరు నిందితులైన షేక్సైలాని బాబా, మహ్మద్ అల్తాఫ్లతో కలిసి కారులో బయలుదేరి వెళ్లారు.దారిలో గంజాయి విక్రయాలు చేసే మీర్జా ఫైజ్ బేగ్ వద్ద గంజాయిని కొనుగొలు చేసి నర్సంపేట శివారు ప్రాంతంలో నిందితుల్లో ఒకడైన షేక్సైలాని బాబాకు చెందిన ఓ పురాతన ఇంటిలో బాధిత బాలికను తీసుక వెళ్ళారు.గంజాయి త్రాగించి షేక్ సైలాని బాబా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఇక నుండి తాము చేప్పినట్లుగా వినాలని లేదంటే గంజాయి త్రాగింది, అత్యాచారం జరిపిన ఘటనలను మొబైల్ ఫోన్లో చిత్రికరించామని భయాబ్రాంతులకు గురి చేశారు. (వాస్తవంగా వీడియా తీయలేదు).ఈ వీడియోను బయట పెడతామని బెదిరించి సదరు మైనర్ బాలికను ములుగు క్రాస్ రోడ్డు వద్ద వదిలి అక్కడి నుండి నిందితులు పారిపోయారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
లవ్ జిహాద్ కానే…కాదు
ఓరుగల్లు కేంద్రంగా ఒకే సెక్షన్ కు చెందిన నిందితులు పక్కా ప్లాన్ తో మైనర్ బాలికలను టార్గెట్ చేసి మోసం చేశారు తప్ప…లవ్ జిహాదీ కానే …కాదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. లవ్ జిహాదీ సంఘటనలు ఇప్పటి వరకు వరంగల్ లో జరగలేదన్నారు. అయిన పేరెంట్స్ ఇక నుండి తమ పిల్లల కదలికలపై కన్నెయ్యాలని సూచించారు.
మొబైల్ ఫోన్స్ కూడా తరుచూ తనిఖీలు చేయాలన్నారు. పిల్లల ప్రవర్తనను తరుచూ గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.
ఇంకా ఫిర్యాదులుంటే చేయండి
మైనర్ బాలికల కిడ్నాప్, ఆపై అత్యాచారాలకు పాల్పడ్డ సంఘటనలు రెండే రెండు బయట పడ్డాయని, ఇంకా ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదులు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఫిర్యాదులను గోప్యంగా ఉంచి దర్యాప్తులు జరిపి నిందితులకు శిక్షలు పడే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఫిర్యాదుల వివరాలను బయటకు పొక్కనివ్వబోమని హామీ ఇచ్చారు. సమాజంలో జరిగే అకృత్యాలపై నేరుగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తేనే నిందితులకు శిక్షలు పడ్డప్పుడే మరెవ్వరూ నేరాలు,ఘోరాలు చేయడానికి జంకుతారని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
అభినందించిన సిపి
నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా,వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, మీల్స్ కాలనీ ఇన్స్స్పెక్టర్ వెంకట రత్నం,ఎసైలు శ్రీకాంత్, సురేష్ లతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.