పరికి రత్నముకు దళిత రత్న అవార్డు
నల్లబెల్లి అక్షర సవాల్ ఏప్రిల్ 16:
మండల కేంద్రానికి చెందిన దళిత సామాజికవేత్త పెరికి రత్నం కు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ కనకరాజుల ఇటికల రాజకుమార్ చేతుల మీదగా అవార్డు అందుకోవడం జరిగింది. దళిత రత్న బిరుదును పొందిన పెరికి రత్నము కు నల్లబెల్లి ప్రజలు స్థానిక గ్రంథాలయ ప్రాంగణంలో దళిత సంఘాలు విద్యావేత్తలు శాలువాతో సన్మానించి. 30 సంవత్సరాలుగా అణగారిన వర్గాలకు దళిత సామాజిక వర్గానికి తను చేసిన సేవలను కొని ఆడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే గోవర్ధన్, దళిత విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి బట్టు సాంబయ్య, నల్లబెల్లి జిపిఓ ఆరోగ్యం, ముచ్చుపుల ఉపసర్పంచ్ బొట్ల దయాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

