ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్పీ దంపతులు
భూపాలపల్లి, మే 13(అక్షర సవాల్):
లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే దంపతులు,జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలోని కుందూరుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎస్పి కోరారు.