Trending Now
Saturday, September 7, 2024

Buy now

Trending Now

5 కోట్లు స్వాహా.. యూనియన్‌ బ్యాంకు మేనేజరు పై కేసు నమోదు..!

5 కోట్లు స్వాహా చేసిన యూనియన్‌ బ్యాంకు మేనేజరు పై కేసు నమోదు..!

నిజామాబాద్ ,జులై 17 ( అక్షర సవాల్ ): 
లోన్ ఇప్పిస్తామని నమ్మిం చాడు. ఆ బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి లోన్‌ కోసం అప్లై చేశారు. అయితే.. లోనైతే మంజూరైంది.. కానీ..లబ్దిదారుల ఖాతాల్లో మాత్రం ఆ లోన్ నిధులు జమ కాలేదు.

నిజామాబాద్‌లో యూనియ న్‌ బ్యాంకు మేనేజర్‌ ఘరా నా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. 40 మందికి చెందిన రుణాల సొమ్ము 5 కోట్లు కాజేశాడు బ్యాంక్ మేనేజర్‌ అజయ్.

లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి.. 8 నెలల క్రితం టర్మ్‌ లోన్‌తో పాటు సీసీ లోన్‌లు మంజూరయ్యాయి. అయితే.. లోన్ మంజూరైన వెంటనే.. ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నా డు. బ్యాంక్ మేనేజర్.

బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి మోసపోయిన బాధితులు పోలీస్‌‌ స్టేషన్‌లో కంప్లైట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. రుణాల మంజూరులో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు.

5 కోట్ల రూపాయలతో ఉడాయించిన యూనియన్‌ బ్యాంక్ మేనేజర్ అజయ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..

Related Articles

Latest Articles