వనదేవతల సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్
మేడారం/మంగపేట, జనవరి 30, అక్షర సవాల్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం వనదేవతలు సమ్మక్క సారక్క పగిడిద్దరాజులను ఎత్తు బంగారంతో దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మేడారంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు వీరి వెంట మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్ లు ఉన్నారు.




