కొమ్మాల జాతర సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
గీసుగొండ, మార్చి 3 అక్షర సవాల్:
కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకుని వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం రాత్రి వరకు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ మార్గాలు….
వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్లేవారు:
మచ్చాపూర్ – పల్లరిగూడ – మొండ్రాయి – కొత్తపల్లి – ఉప్పరపల్లి – కోనాపురం – చెన్నారావుపేట గ్రామాల మీదుగా నర్సంపేట చేరుకోవాలి.
నర్సంపేట నుంచి వరంగల్ వైపు వచ్చేవారు:
గిర్నిబావి – నాచనపల్లి – లక్ష్మీపురం – ఎల్కుర్తి – మచ్చాపూర్ మార్గం గుండా వరంగల్ చేరుకోవాలి. జాతర సందర్భంగా పోలీసులు సూచించిన మార్గాలను తప్పనిసరిగా అనుసరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. భక్తులు, వాహనదారులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు చేసుకోవాలని పోలీసులు సూచించారు.


