మానుకోట మున్సిపల్ చైర్మన్ గా గుగులోతు జ్యోతి రమేష్
మానుకోట చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం
స్వతంత్ర అభ్యర్థిగా జ్యోతి రమేష్ కు పట్టం
శుభాకాంక్షలు తెలిపిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మానుకోట ఫిబ్రవరి 16వ అక్షర సవాల్ : కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో చైర్మన్ గిరిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. పూర్తి మెజార్టీ లేక రెండు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను చేజి క్కించుకునే పనిలో పడ్డాయి. అదృష్టవశాత్తు 4 వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా జ్యోతి రమేష్ నాయక్ ను చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరచగా మెజార్టీ సభ్యులు జ్యోతి రమేష్ ను చైర్మన్ గా ఎన్నుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారథ్యంలో మానుకోట చైర్మన్ పదవిని ఎట్టకేలకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.



