

మృతదేహాన్ని గుర్తించిన జాలర్లు
మంగపేట, పిబ్రవరి17, అక్షర సవాల్:
మండలంలోని కమలాపురం బెల్ట్ కంపెనీ ఇంటెక్ వెల్ గోదావరి నది ప్రవాహంలో మృతదేహం లభించింది. మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన జాలర్లకు గోదావరి నీటిలో బోర్ల పడి తేలుతున్న మృతదేహన్ని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని జాలరు కృష్ణ తెలిపారు సమాచారం అందిన వెంటనే పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తాళ్లతో బయటికి తీసారు. కమలాపురం రైస్ మిల్ బజారులో నివాసముంటున్న జాన చుక్కమ్మ రెండవ కుమారుడు జాన రవి గా గుర్తించినట్లు రవి బంధువులు తెలిపారు.

