బాధిత కుటుంబానికి యువ నేత భరోసా
మంగపేట, పిబ్రవరి 23, అక్షర సవాల్:
మండలంలోని చేరుపల్లి (కొత్తపేట)గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ బాబాయి పార్టీ నాయకులు ముత్తినేని వసంతరావు అనారోగ్య కారణంగా మృతి చెందాగా సోమవారం దశదిన కర్మకు కాంగ్రెస్ పార్టీ యువ నేత కుంజా సూర్య హాజరై ముత్తినేని వసంతరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని యువ నేత కుంజా సూర్య భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మైల జయరాంరెడ్డి వసంత శ్రీనివాస్ యాదవ్ చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు అయ్యోరి యాణయ్య బండ జగన్మోహన్ రెడ్డి పూజారి సురేందర్ బాబు మురుకుట్ల నరేందర్ చిలకమర్రి శ్రీనివాస్ చాద మల్లయ్య బసరికాని నాగార్జున పాల్గొన్నారు.

