Trending Now
Sunday, March 1, 2026

Buy now

Trending Now

ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ఏఓ చేరాలు

ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ఏఓ చేరాలు

 

మంగపేట, జనవరి 26 ( అక్షర సవాల్  )  :  గణతంత్ర దినోత్సవంను పురష్కరించుకుని అందచేసే ఉత్తమ ఉద్యోగి అవార్డుకు మంగపేట మండల వ్యవసాయ శాఖ అధికారి నేదునూరి చేరాలు ఎంపికయ్యారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా నేదునూరి చేరాలు ఈ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్న నేదునూరి చేరాలుకు ఏఈఓలు , నాయకులు, రైతులు అభినందనలు తెలిపారు.

Related Articles

Latest Articles