నేడే చంద్రగ్రహణం
ప్రముఖ ఆలయాల మూసివేత
మంగపేట, మార్చి 03, అక్షర సవాల్:
నేడు చంద్రగ్రహణం కారణంగా ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో స్వయంభుగా వెలసి కొండల నడుమ కొలువుదీరిన శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని
మంగళవారం ఉదయం స్వామి వారికి ఆరాధన, నివేదన చేసి (ద్వారా బంధనం) ఆలయ తలుపులు మూసి వేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి రెవెల్లి మహేష్ తెలిపారు. బుధవారం దేవాలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర శర్మ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

