మేడారం మహా జాతరపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
– మద్యం సేవించి జంపన వాగులోకి వెళ్లొద్దు
– భక్తులకు మౌలిక సదుపాయాల ఏర్పాట్లు
-మంత్రి సీతక్క
మంగపేట/మేడారం ప్రత్యేక ప్రతినిధి,జనవరి 25, అక్షర సవాల్:
శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క తెలిపారు.ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ల తో కలిసి మేడారం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ఇందులో భాగంగా చిలకలగుట్ట ప్రాంతాన్ని సందర్శించి అక్కడ భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు మౌలిక సదుపాయాలపరిస్థితిని పరిశీలించారుఅనంతరం ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించి, అక్కడ చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మద్యం సేవించి జంపన్న వాగులోకి వెళ్లవద్దని భక్తులను సూచించారు. అలాగే మేడారం చేరుకున్న వెంటనే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం అమ్మవార్ల దర్శనం చేసుకుని వంటావార్పు నిర్వహించుకోవాలని తెలిపారు రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లోఅప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే జాతర సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులను ఒంటరిగా ఎక్కడికీ వదిలివేయకూడదని మంత్రి స్పష్టం చేశారు.కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఉండాలని, ఎవరికైనా దారి తప్పితే వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందిని లేదా అధికారులను సంప్రదించాలని సూచించారు మంత్రి సీతక్క మాట్లాడుతూ, జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, దర్శన సౌకర్యాలు వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




