Trending Now
Saturday, March 14, 2026

Buy now

Trending Now

పదోతరగతి పరీక్షలు ప్రారంభం 

మంగపేట పరీక్ష కేంద్రం వద్ద పిల్లల తల్లిదండ్రులు 

కమలాపురం పాఠశాల వద్ద వేచి చూస్తున్న తల్లిదండ్రులు

పదోతరగతి పరీక్షలు ప్రారంభం 

తల్లిదండ్రుల గుండెల్లో గుబులు

పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి

శుభాకాంక్షలు తెలిపిన ఉపాధ్యాయులు

మంగపేట,మార్చి 14, అక్షర సవాల్: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి (మార్చి14 నుంచి ఏప్రిల్ 16 వరకు ) పరీక్షలు నిర్వహించబడతాయి. శనివారం నుండి మండల కేంద్రంలోని కమలాపురం, మంగపేట, రాజుపేట పలు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉదయమే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు మొదటి రోజు కావడంతో తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలైంది. మా పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. మరోవైపు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీచర్లు విద్యార్థులకు పరీక్షలు జాగ్రత్తగా రాసి మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను పరిశీలిస్తున్న పోలీసులు

 

Related Articles

Latest Articles