ఆఖరి ఘట్టానికి చేరుకున్న మేడారం మహా జాతర
మేడారం/మంగపేట, జనవరి 31, అక్షర సవాల్:
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన దేవతలను గౌరవించి జరుపుకునే గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర శనివారంతో ఆఖరి ఘట్టానికి చేరనున్నది దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుంది మూడు రోజులగా గద్దలపై కొలువుదీరిన దేవతలు కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మేడారం మహా జాతర నేటితో ముగుస్తుంది. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని అధికారుల అంచనా వేస్తున్నట్టు తెలుపుతున్నారు.


