Trending Now
Saturday, May 31, 2025

Buy now

Trending Now

నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు..

నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు..

షాద్ నగర్ పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్న సి.ఐ విజయ్ కుమార్

రంగారెడ్డి జూలై 25 అక్షర సవాల్ : రంగారెడ్డి జిల్లా పట్టణ పరిధిలోని పలు కిరాణా షాపులలో నిషేధిత పదార్థాలు గుర్తించడానికి పోలీస్ తనిఖీలు నిర్వహించారు.నిషేధిత గంజాయి అక్రమ రవాణాను నిరోధించడానికి నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్లు డాగ్ స్క్వాడ్ బుధవారం పలు కిరణ షాప్, మొదలగు ప్రాంతల్లో తనిఖీలు చేపట్టడం జరిగిందని టౌన్ సి.ఐ విజయ్ కుమార్ అన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా వ్యక్తుల వద్ద , పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని తెలిపారు..

Related Articles

Latest Articles