Trending Now
Trending Now

మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల కోసం సింగరేణి క్వార్టర్స్ కేటాయింపు

మెడికల్ కాలేజీలో బోధించే ప్రొఫెసర్ల కోసం సింగరేణి రామప్ప కాలనీలోని 3 క్వార్టర్స్ కేటాయింపు

— జయశంకర్ భుపాలపల్లి జిల్లా  కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి , జూన్ 28 ( అక్షర సవాల్ ): 
జయశంకర్ జిల్లా భూపాలపల్లి లోని మెడికల్ కాలేజీ లో భోదించడానికి నియమితులైన ప్రొఫెసర్ల కోసం సింగరేణి రామప్ప క్వార్టర్స్ లో ని 3 బ్లాక్ లను కేటాయిచారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సింగరేణి జి ఎం తో కలసి క్వార్టర్స్ ను సందర్శించారు. మూడు క్వార్టర్స్ లలో వారికి కావలసిన మౌళిక వసతులను , మెస్ ను నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ సింగరేణి అధికారులను కోరారు. ఇందులో భాగంగా మహిళ ప్రొఫెసర్ లకు పురుషులకు వేరు వేరుగా క్వార్టర్స్ ను కేటాయిచడం జరిగిందని, అందరికి ఒకే మెస్ కాకుండా వేరు వేరుగా భోజన వసతి కలిపించాలని కలెక్టర్ అన్నారు .క్వార్టర్స్ లో వారికి కావలసిన మౌలిక వసతుల ను త్వరితగతిన పూర్తి చేయాలని సింగరేణి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్స్ పాల్, రాజు దేవుడే, సింగరేణి జి ఎం , శ్రీనివాసరావు, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Latest Articles