Trending Now
Trending Now

తల్లిదండ్రులు తిడుతారని.. ఆత్మహత్య..

నర్సంపేట( అక్షర సవాల్ ): ఆన్ లైన్ గేమ్ కు ఓ యువకుడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన నెక్కొండ మండలం అప్పల్ రావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

గ్రామానికి చెందిన బాషబోయిన కమలాకర్-స్వప్న దంపతుల రెండో కొడుకు ఉదయ్(19) శుక్రవారం రాత్రి ఆన్ లైన్ గేమ్ ఆడారు. ఈ క్రమంలో దాదాపు 40 వేల రూపాయలు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల మృతుడి తండ్రి ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉదయ్ తల్లి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ఆడారు. ఆ ఫోన్ నంబర్ బ్యాంక్ అకౌంట్ కు లిక్ ఉండడంతో రూ.40వేలు పోగొట్టుకున్నాడు. విషయం తెలిస్తే అమ్మానాన్న తిడుతారో.. లేక కొడుతారోననే భయంతో ఇంట్లో వేరే గదిలో ఉన్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .

Related Articles

Latest Articles