Trending Now
Trending Now

గ్రూప్ -4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. కలెక్టర్ భవేష్ మిశ్రా

గ్రూప్ -4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

  • జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
  • గ్రూప్ 4 పరీక్షకు ఉదయం 9.45, మధ్యాహ్నం 2.15 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి
  • టి.ఎస్.పి.ఎస్.సి ప్రతిపాదించిన ప్రతి సూచన తూచ తప్పకుండా పాటించాలి
  • హాల్ టికెట్లో ఫోటో ముద్రన సరిగా కాకపోతే అభ్యర్థులు గెజిటెడ్ అధికారి చే అట్టేస్తేడ్ చేయించాలి
  • 29 పరీక్షా కేంద్రాల్లో 7482 మందికి గ్రూప్ 4 పరీక్ష నిర్వహణ
  •  జులై -1 న నిర్వహించు గ్రూప్ -4 పరీక్షా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

భుపాలపల్లి , జూన్ 28 (అక్షర సవాల్ ): 
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జులై -1 న నిర్వహించు గ్రూప్ -4 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాసంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ దివాకర తో కలిసి జిల్లాలో జులై -1 న నిర్వహించు గ్రూప్ -4 పరీక్ష సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జులై -1 న టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా నిర్వహించే గ్రూప్-4 పరీక్షలకు జిల్లాలో టి.ఎస్.పి.ఎస్.సి నియమ, నిబంధనల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి అభ్యర్థులు సజావుగా పరీక్షలు వ్రాసే విధంగా చూడాలని, ఇందుకు గాను అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.

జులై -1 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12-30 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష ఉంటుందని, జిల్లాలో 29 సెంటర్ల లో మొత్తం 7,482 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.

టి.ఎస్.పి.ఎస్.సి. గైడ్ లైన్స్ ను ప్రతి ఒక్కరూ చదివి, నిబంధనలు పాటించాలని, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా సందర్శించి త్రాగునీటి, విద్యుత్, సీటింగ్, సి.సి. కెమెరాల ఏర్పాటును, ఇతర మౌళిక వసతులను సరి చూసుకోవాలని సూచించారు. పరీక్ష రోజు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్ లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు.

ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఆశ, ఒక ఏ.ఎన్.ఎం. లను ఉంచాలని, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు వెళ్ళే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, ఆభరణాలు ధరించి రావద్దని, పరీక్ష రోజు చెప్పులు ధరించాలని తెలిపారు.

గ్రూప్ 4 పరీక్ష నిర్వహణ అత్యంత పటిష్టంగా జరగాలని, చిన్న తప్పుకు కూడా ఆస్కారం ఉండవద్దని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో హాజరయ్యే ప్రతి విద్యార్థి ప్రశాంతంగా నిబంధనల ప్రకారం పరీక్ష రాసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్, 48 మందికి ఇద్దరు ఇన్విజిలేటర్ల ను నియమించాలని,అదనంగా 10% సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు ఉండాలని కలెక్టర్ తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద సెల్ ఫోన్ వంటి పరికరాలు భద్రపరుచుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, అభ్యర్థులను చెక్ చేసేందుకు పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు.

గ్రూప్ 4 పరీక్షకు 15 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రం గేట్ మూసివేయాలని, ఉదయం జరిగే పరీక్షకు 8 గంటల నుంచి 9.45 గంటల వరకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 1 గంట నుంచి 2.15 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రం గేటు మూసినా తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబడదని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను పోలీసుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూం నుండి నిబంధనలు పాటిస్తూ తరలించాలని అన్నారు.

గ్రూప్ 4 ప్రశ్నాపత్రాల కవర్ ను ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలో ఓపెన్ చేయాలని, పరీక్ష ప్రారంభానికి ముందే ఇన్విజిలేటర్లు ప్రతి అభ్యర్థి తమకు కేటాయించిన సీటులో కూర్చున్నారో లేదో చెక్ చేసుకోవాలని, ప్రతి అభ్యర్థికి నిర్దేశించిన జవాబు పత్రం, ప్రశ్నాపత్రం అందజేయాలని కలెక్టర్ తెలిపారు.

గ్రూప్ -4 పరీక్షకు హాజయ్యేఅభ్యర్థుల హాల్ టికెట్లో ఫోటో ముద్రన కాకపోయినా చో , ముద్రణ సరిగా లేకపోయినా అభ్యర్థులు గెజిటెడ్ అధికారి అట్టేస్తేడ్ చేయించి అదనంగా 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డు, హాల్ టికెట్ లు చూపించి పరీక్షా కేంద్రంకు వెళ్లాలని తెలిపారు.

ముందుగా అదనపు కలెక్టర్ దివాకర చీఫ్ సూపరింటెండెంట్, లైజనింగ్ అధికారులు, రూట్ అధికారులు పరీక్ష రోజు చేయవలసిన విధి, విధానాలను క్షుణ్ణంగా వివరించారు. పరీక్షా కేంద్రాల్లో సీటింగ్ , రూమ్ వారీగా అభ్యర్థుల కేటాయింపు, దివ్యంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లొనే గదులు కేటాయించాలని, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలు పకడ్బందీగా జరగాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజనింగ్ అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎం.పి.ఓలు, కలెక్టరేట్ ఏ.ఓ., సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles